హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి శాలివాహన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది వృత్తి కళాకారులకు యంత్రాలు మంజూరు చేసింది. వీరితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ప్రత్యేక మండలానికి ఒకటి చొప్పున ఆధునిక కుండల బట్టీలను మంజూరు చేసింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
యంత్రాల ద్వారా మట్టి పాత్రలు, మట్టి నీళ్ల కూజాలు, టీకప్పులు, మట్టి విగ్రహాలు, మట్టి దీపకుండీలు, ఇతరత్రా అలంకరణ వస్తువులు వేగంగా చేయడానికి వీలు కలుగనుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన ఆధునిక పాటరీ యంత్రాలు 80వేల సబ్సిడీపై అందనున్నాయి. శిక్షణ పొందిన అనంతరం 320 మంది అభ్యర్థులు తమ వాటాగా రూ.20వేలు జమ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో శాలీవాహన కుమ్మరి కులస్తుల ఆదాయం పెరిగి.. ఆర్థిక స్వావలంభన సాధించేందుకు బాటలు పడనున్నాయి.