Raj Thackeray | మహారాష్ట్రలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ నెల మూడో తేదీన బహిరంగంగా హన్మాన్ చాలీసా పఠించవద్దని పార్టీ శ్రేణులను కోరారు. ముస్లిం సోదరులు ఈద్ జరుపుకునే వేళ సామాజిక ఉద్రిక్తతలు సృష్టించొద్దని కోరుతూ ట్వీట్ చేశారు.
`శంభాజీనగర్ సభలో నేను ఇప్పటికే చెప్పాను. రేపు ఈద్. ఈ పండుగ ముస్లింలు తప్పనిసరిగా సంతోషంతో జరుపుకునే పండుగ. అందరితో చర్చించిన మీదట అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకంగా హారతులు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర మతాల వారు జరుపుకునే సంబురాలకు ఆటంకాలు కలిగించాలని మనం కోరుకోవడం లేదు. లౌడ్ స్పీకర్ల ఏర్పాటు ఒక సామాజిక అంశం. మత పరమైన అంశం కాదు. తదుపరి కార్యాచరణపై నేను చేసే ట్వీట్ కోసం వేచి చూడండి` అని రాజ్ఠాక్రే ట్వీట్ చేశారు.
ఇటీవల మహారాష్ట్రలో బయట లౌడ్ స్పీకర్లు పెట్టొదని, లేకపోతే తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని ఇంతకుముందు రాజ్ఠాక్రే ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో ఈ అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.