హైదరాబాద్ : సెంట్రల్ విస్టాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి (Parliament Building) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలోని 3వ అధికరణ కల్పించిన హక్కుల మేరకు తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్తు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని, దానికి సంబంధించి మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ సంస్కరణలు రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.