ముంబై: నిన్నటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా ఉన్న శివసేన ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఇవాళ రూటు మార్చేశారు. వారం రోజుల క్రితం ఉద్ధవ్ కోసం ప్రచారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే సంతోష్.. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు. గత రెండు వారాల నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ వర్గం.. ఉద్ధవ్ నుంచి వేరుపడిన సమయంలో ఎమ్మెల్యే సంతోష్ తన నియోజకవర్గంలో ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో ప్రజలంతా ఉద్ధవ్కు మద్దతుగా నిలువాలని కోరారు. ఉద్వేగంగా మాట్లాడుతూ ఉద్ధవ్ వద్దకు ఏక్నాథ్ రావాలని కోరుకున్నారు. ఆ ప్రసంగం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఏడ్చేశారు. ర్యాలీలో పక్కనే ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే సంతోష్ కన్నీళ్లను కూడా తూడ్చాడు. ఉద్ధవ్తోనే తామంతా ఉన్నట్లు కూడా చెప్పారు. జూన్ 24వ తేదీన ఈ ఘటన జరిగింది. కానీ ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యే భాంగర్ తన మద్దతును ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా ప్రకటించారు. మరో ఎమ్మెల్యే శ్యామ్సుందర్ షిండే కూడా చివరి నిమిషంలో ఏక్నాథ్కు అనుకూలంగా ఓటేశారు.
आज मतदारसंघांमध्ये परत आल्यानंतर उपस्थित शिवसैनिकांना संबोधित करताना अश्रू अनावर झाले….शेवटच्या श्वासापर्यंत आदरणीय शिवसेना पक्षप्रमुख #उद्धव_ठाकरे साहेबा सोबत. @ShivSena @AUThackeray pic.twitter.com/loMHpUI4cL
— आमदार संतोष बांगर (@santoshbangar_) June 24, 2022
#WATCH | Santosh Bangar supported the Trust vote and was hooted at by the MLAs on the Opposition benches.
Bangar was in the Uddhav Thackeray camp of Shiv Sena until yesterday and was seen in the Eknath Shinde camp today. pic.twitter.com/FDewzcw0fB
— ANI (@ANI) July 4, 2022