కవాడిగూడ, డిసెంబర్ 24 : భోలక్పూర్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ మొదిటి వెంచర్లో శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన నూతన పైపులైన్ను ఆయన జలమండలి డీజీఎం చంద్రశేఖర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భోలక్పూర్ డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రంగానగర్ మొదటి వెంచర్లో తాగునీటి పైపులైన్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో నూతన పైపులైన్ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషిచేసస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యుజవన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్గౌడ్, మున్వర్చాంద్, ఆర్. శ్రీనివాస్, జునేద్ బాగ్ధాది, కల్యాణ్, కేఎం. సాయి, మక్బూల్, గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.