ముషీరాబాద్, సెప్టెంబర్ 9 : అడిక్మెట్ డివిజన్ దీన్దయాళ్నగర్ బస్తీలో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పేదల బస్తీల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గురువారం ఆయన దీన్దయాళ్నగర్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు డ్రైనేజీ, మంచినీరు, రోడ్డు, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా వాంబే ఇండ్లు శిథిలావస్థలకు చేరుకొని స్లాబు పెచ్చులూడుతున్నాయని, భవనానికి మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్, సురేందర్, సయ్యద్ అస్లాం, బొట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముషీరాబాద్ చేల మార్కెట్లో ఎమ్మెల్యే పర్యటించి పారిశుధ్య, మ్యాన్హోల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దీన్దయాళ్రెడ్డి, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.