జడ్చర్ల : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి నేతాజీ చౌరస్తాలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ CNR ఫౌండేషన్ ద్వారా పది మంది దివ్యాంగులకు Gift A Smile కార్యక్రమంలో భాగంగా స్కూటీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల విలేకరుల కోసం కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే కేటాయిస్తామని అన్నారు.
అంతకుముందు డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్ లో మరియు ZPHigh school బాలుర పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
అక్కడే పలువురు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
మహిళల అభ్యన్నతి, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు జడ్చర్ల మండలంలోని (50) స్వయం సహాయక సంఘాలకు రూ. 3.75 కోట్ల రుణాలను అందించారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వయంగా కార్మికులకు భోజనాలను వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.