జోగులాంబ గద్వాల : గద్వాల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరుఅందిస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ( Krishna Mohan Reddy ) తెలిపారు. మంగళవారం ధరూర్ మండలం రేలంపాడు రిజర్వాయర్ ( Relampadu Reservior ) నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాలకు ఎగువ నుంచి వరద నీరు రోజు చేరుతుండడంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు .
ప్రస్తుతం రిజర్వాయర్లో రెండు టీఎంసీల వరకు నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉందన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో ధరూర్ వైశ్య ఎంపీపీ సుదర్శన్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ , జడ్పీటీసీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు .