కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. కార్పొరేటర్లు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఎస్ఎన్డీపీ, హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బీ, లాఅండ్ ఆర్డర్, మున్సిపల్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు.
కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ లలో రూ.118 కోట్లతో జరుగుతున్న 698 అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు కొత్త పనులను వెంటనే ప్రారంభించేలా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సహకారంతో నాలాల అభివృద్ధికి ఎస్ఎన్డీపీ కింద మంజూరైన రూ.84.63 కోట్లతో పనులను వేగంగా ప్రారంభించాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేటర్లు వారి కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చూస్తామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై స్పందించాలని సూచించారు.
అనంతరం ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొ రేషన్కు స్వచ్ఛ సర్వేక్షణ్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డు దక్కడంతో ప్రజాప్రతినిధులను, అధికారులను, సిబ్బందిని అభినందించి.. ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు దక్కేలా పని చేయాలన్నారు. డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్లు, మెంబర్లు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ సాయికృష్ణ కాలనీలో భూగర్భ డ్రైనేజీ ఔట్లెట్ సమస్యపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులతో కలిసి సందర్శించి.. పరిశీలించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి, నాగరాజ్యాదవ్, చందు, రాములునాయక్, తదితరులు పాల్గొన్నారు.