కుత్బుల్లాపూర్, నవంబర్ 29 : ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం సూరారం డివిజన్ పరిధిలోని న్యూ షాపూర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతోపాటు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భా స్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, యువ నాయకుడు మంత్రి అరు ణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముకుంద్రావు, నాయకులు మధుమోహ న్, అమీర్ఖాన్, బస్తీ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ఆకుల రాజ్కుమార్, రవికుమార్, ఉమర్, సంజీవకుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..
కుత్బుల్లాపూర్ డివిజన్, మధుసూదన్రెడ్డినగర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహకారంతో రూ.38 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా కాలనీ సంక్షేమ సం ఘం ప్రతినిధులు సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీల్లో మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మల్లేశ్, నాగన్న, నర్సింగ్, శ్రీనివాస్, మధు, యాదగిరి, వేణు, నామ్దేవ్, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.