అంబర్పేట, డిసెంబర్ 17: అంబర్పేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్ డీడీ కాలనీ వాటర్ ట్యాంకు వద్ద రూ.22 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న తాగునీటి పైప్లైన్ పనులను కార్పొరేటర్ పద్మావెంకటరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ తదితర డివిజన్లలో ఎక్కడెక్కడా కలుషితనీటి సరఫరా జరుగుతుందో, ఎక్కడ నీరు లోప్రెషర్తో వస్తుందో గుర్తించి అక్కడ నూతన పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.
అలాగే పాత పైప్లైన్ల స్థానంలో కొత్త పెద్ద సైజు పైప్లైన్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. మరో 20 ఏండ్ల వరకు నీటి ఇబ్బందులు రాకుండా మొత్తం పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. తాగునీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా ఆధునీకరిస్తున్నామని తెలిపారు. అన్ని బస్తీల్లో కొత్త డ్రైనేజీ పైప్లైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం సతీశ్, మేనేజర్ మాజిద్, డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, బాగ్అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, అరుణ్రెడ్డి, మిర్యాల రవి, డా.ఎస్.సులోచన, మహేశ్, శివాజీయాదవ్, అఫ్రోజ్పటేల్, చంద్రశేఖర్గౌడ్, దారయోబు, నవీన్, సంపత్, సంతోష్, ఘని, శ్రీనివాస్యాదవ్, ప్రదీప్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు డా.ఎన్. గౌతంరావు, కృష్ణాగౌడ్, అజయ్కుమార్, గోవర్ధన్రెడ్డి, చుక్క జగన్, మల్లారెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
కాచిగూడ: ప్రజల కోసం పనిచేసినప్పుడే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సునీల్బిడ్లాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కాలేరును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, ఫొటో ప్రతిమను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెంటయ్య, దాత్రిక్ నాగేందర్బాబ్జి, సదానంద్, బబ్లూ, పరుశురాం, ఆంటోని,తదితరులు పాల్గొన్నారు.