కాచిగూడ, డిసెంబర్ 5 : నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని కామ్గార్నగర్ తదితర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి అధికారులతో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. కామ్గార్నగర్ బస్తీలో లోప్రెషర్ నీటితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే ఏండ్లనాటి డ్రైనేజీని తొలగించి నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ మాజీ అధ్యక్షుడు భరత్రాజ్ ముదిరాజ్, బి. కృష్ణాగౌడ్, రెడపాక రాము, కాలేరు రాజు, యూసుఫ్షరీఫ్, పి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.