నిజామాబాద్ : జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరించిన ఎమ్మెల్సీ కవితకు జీవన్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకే కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు.