భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇల్లందులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఈ ఉదయం ఆమె ప్రసవించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్, ఆమె భర్త ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. విజయదశమి పండుగ రోజున మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.