వనస్థలిపురం, డిసెంబర్ 28 : నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయనగర్ పార్కులో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనస్థలిపురం, బీఎన్రెడ్డినగర్ డివిజన్లలో చాలా పార్కులను అభివృద్ధి చేశామన్నారను. హెచ్ఎండీఏ నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి థీమ్ పార్కులను నిర్మించడం జరిగిందన్నారు. రూ.40లక్షలతో సెక్టార్2 పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. థీమ్ పార్కుల అభివృద్ధిలో భాగంగా రూ.80లక్షలు అదనంగా కేటాయించడం జరిగిందన్నారు.
ఆహ్లాదాన్ని పంచడంతోపాటు, వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిన్నా, పెద్దా కుటుంబమంతా సేదతీరే విధంగా పార్కులను రూపొందిస్తున్నామన్నారు. అందమైన పువ్వులు, ఆకర్షణీయమైన చెట్లు, వాటర్ ఫౌంటేయిన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటిరెడ్డి అరవింద్రెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, ఉమేశ్గౌడ్, మాధవరం నర్సింహారావు, రాఘవేందర్రెడ్డి, పోగుల రాంబాబు, అశోక్గౌడ్, చంద్రశేఖర్రెడ్డి, నరసరాజు తదితరులు పాల్గొన్నారు.