ఎల్బీనగర్, డిసెంబర్ 8: నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లలో ముంపు సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన స్కై, ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నూతన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నూతన యూజీడీ లైన్స్, స్ట్రామ్ డ్రైన్స్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, థీమ్ పార్కు పనులు నాణ్యతాప్రమాణాలతో చేయాలని తెలిపారు.
నాగోల్ డివిజన్ పరిధిలోని త్యాగరాయనగర్ కాలనీ నందు కమ్యూనిటీ హాల్ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ నందు నిర్మించదలిచిన కమ్యూనిటీ హాల్ కాకుండా డిఫెన్స్ కాలనీ నందు నిర్మించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటీ కమిషనర్లు సురేందర్ రెడ్డి, మారుతీ దివాకర్, కృష్ణయ్య, ఎస్ఈ అశోక్రెడ్డి, పలువురు ప్రాజెక్టు ఈఈలు, డీఈలు, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.