పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి(Dasari Manohar Reddy) పేర్కొన్నారు. జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన మ్యాకల శ్రీకాంత్, మాజీ వార్డు మెంబర్ గొర్రె కరుణాకర్,గొర్ల దేవేందర్,గంప రాజు, చేగొండ అజయ్, శనిగారపు రామ్మూర్తి, బోడకుంట మనోజ్, లశెట్టి వరుణ్, పెర్క నర్సయ్య, మ్యాకల సదానందం, సిరాల వెంకటేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా(Model) ఉండడం గర్వకారణమని అన్నారు. కొత్తగా పార్టీలోకి చేరిన వారు ప్రభుత్వ పథకాలను(Government Schemes) ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్, ఎంపీటీసీ రమాదేవిరాజమల్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదే చంద్రయ్య, తిప్పని శ్రావణ్, మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.