కోహెడ, ఫిబ్రవరి 10 : జిల్లాలోని కోహెడ మండలం బత్తులవానిపల్లిలో నిర్మిస్తున్న దుర్గామాత ఆలయ నిర్మాణానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ చేయూతను అందించినట్లు సర్పంచ్ కన్నం లక్ష్మి, ఎంపీటీసీ కొడిముంజ మల్లవ్వ గురువావారం తెలిపారు.
ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ను కోరగా 400 సిమెంట్ బస్తాలను అందించేందుకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఇందులో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాయిని మాధవ్, సభ్యులు ర్యాగటి స్వర్ణ, ఆకుల మల్లయ్య, మరేల్ల చంద్రయ్య, కాసెట్టి సిద్దయ్య, బత్తుల మొగిలి తదితరులు ఉన్నారు.