హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శనివారం సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు. నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.