కోల్కతా : పలు రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపాటుకు గురైనా కాషాయ పార్టీ కుటిల యత్నాలను కొనసాగిస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించిన బెంగాల్ బీజేపీ నేత, నటుడు మిధున్ చక్రవర్తి తాజాగా మరోసారి బాంబు పేల్చారు.
కోల్కతాలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలక తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో నేరుగా టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలోనూ తాను ఈ విషయం చెప్పానని ఇప్పుడూ ఇదే మాటకు కట్టుబడి ఉన్నానని కేవలం తగిన సమయం కోసం వేచిచూస్తున్నామని పేర్కొన్నారు.