హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీని జోస్యుల దర్శకుడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకు రానుంది. శనివార నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘ఓటీటీ ఆఫర్లొచ్చినా థియేటర్ రిలీజ్ వైపే మొగ్గుచూపాం. అనూహ్య మలుపులతో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేస్తుంది’ అని హీరో హర్షా తెలిపారు. సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్దత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జనా.డి, సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీని జోస్యుల.