ఢిల్లీ ,జూన్ 4: బ్రిక్స్ దేశాల సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్నార్ నిర్వహించింది. భారత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ వెబినార్లో భారత్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, బ్రెజిల్ దేశాల సంప్రదాయ ఔషధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత వెబినార్ నిర్వహణ కోసం, ఈ ఏడాది ఫిబ్రవరి 24-26 తేదీల్లో జరిగిన సమావేశంలోనే భారత్ ప్రతిపాదించగా, సభ్య దేశాలు అంగీకరించాయి. “సంప్రదాయ ఔషధ రంగంలో బ్రిక్స్ నిపుణులు” పేరిట ఈ ఏడాది మార్చి 25న కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ వర్చువల్ సమావేశం నిర్వహించింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుడు డా.మనోజ్ నేసరి ఈ వెబినార్కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బ్రిక్స్ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, సంప్రదాయ వైద్య రంగంలో “భారతదేశ బ్రిక్స్ 2021” ప్రాధాన్యతలను డా.నేసరి వివరించారు. భారత్ చేసిన ప్రతిపాదనల్లో, ‘సంప్రదాయ ఔషధ రంగంలో బ్రిక్స్ సహకారంపై అవగాహన ఒప్పందం’, ‘సంప్రదాయ ఔషధాలపై బ్రిక్స్ ఫోరం'(బీఎఫ్టీఎం)ఏర్పాటువంటి అంశాలు ఉన్నాయి
బ్రిక్స్ దేశాల మధ్య సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణ అవసరాన్ని డా.నేసరి స్పష్టం చేశారు.ఆయుష్ ఔషధాల ద్వారా కొవిడ్ను నియంత్రించడానికి భారత్ తీసుకున్న చర్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.బ్రిక్స్ దేశాలతోసహా ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఔషధాలను ప్రోత్సహించడానికి భారత్ చేపట్టిన ప్రయత్నాల బ్రిక్స్ దేశాల సంప్రదాయ వైద్య రంగ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులుప్రశంసించారు.ఈ విషయంలో సహకారం,మద్దతును అందిస్తామని ప్రకటించారు.