హైదరాబాద్ : మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతి పట్ల మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు . ఆయన మృతితో మహబూబాబాద్ ప్రాంత గిరిజనులు తమ పెద్ద దిక్కును కోల్పోయారని, తీరని లోటు అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
రాథోడ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగ్యా నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.