చిక్కడపల్లి, డిసెంబర్ 5 : వంద సంవత్సరాల చరిత్రలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన రవీందర్యాదవ్కు ఉస్మానియా యూనివర్సిటీ చాన్స్లర్ పదవి రావడం సంతోషంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వీసీ పదవికి ఎంతో మంది పోటీలో ఉన్నా.. బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ రవీందర్ యాదవ్కు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ గొల్ల, కురుమ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీసీ రవీందర్ యాదవ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కురుమ, డాక్టర్ ఆవుల వెంకట్యాదవ్, ప్రొఫెసర్ బి.గోపాల్రావు, డాక్టర్ ఎస్.అంజయ్య, బద్రినాథ్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు కోటి యాదవ్, వీరు యాదవ్, డాక్టర్ అశోక్ యాదవ్, మురళీ యాదవ్ పాల్గొన్నారు.