హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్లో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎందరో మహనీయుల తాగ్యాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన గురించి విద్యార్థులకు తెలియజెప్పేందుకు గాంధీ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అలాగే 75 ప్రాంతాల్లో ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేసి, మొక్కలు నాటుతున్న పేర్కొన్నారు.