హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30తో బార్ల లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్సులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. అలాగే ఏ4 వైన్స్షాప్ల లైసెన్సుల గడువు సైతం అక్టోబర్ 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.