బడంగ్పేట, డిసెంబర్ 23: పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్ సర్వే నంబర్ 119 లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం మంత్రి చేతుల మీదగా పేదలకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ, పేదలు గౌరవ ప్ర దంగా బతకడానికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి అందించడం జరుగుతుందన్నారు.
గతంలో ప్రభు త్వం 255 మందికి జారీ చేసిన ఆర్డర్ కాపీలు ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామన్నారు. మొదటి దశలో ఐదు బ్లాక్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒక్కో బ్లాక్లో 16 ఇండ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. 80 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. మిగతా వారికి ఇండ్లు పూర్తి కాగానే అందజేస్తామని ఆమె తెలిపారు. ఆర్డర్ కాపీలున్న వారు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు.
అర్హులైన వారికి తప్పకుండా ఇండ్లు వస్తాయన్నారు. అర్హు లు కాని వారు ఎవరైనా సర్టిఫికెట్లు తీసుకుంటే తిరిగి ఇవ్వాలన్నారు. శ్రీను నాయక్ తన పేరు మీ ద జారీ చేసిన డబుల్ బెడ్ రూం ఇల్లు సర్టిఫికెట్ ను తిరిగి అందజేశాడని ఆమె అన్నారు. అలాంటి వారు ఎవరు తిరిగి ఇవ్వాలన్నారు. పేదలకు మే లు చేసిన వారు అవుతారన్నారు. మొదటి దశలో పూర్తి చేసిన ఇండ్లలో కొంత మంది తలుపులు, కి టికీలు, మోటర్లు తీసుకుపోతున్నారన్న ఉద్దేశంతో ఇండ్లు కేటాయించడం, గుడిసెలలో ఉన్న వారికి మొదటి ప్రధాన్యత ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా 2.84 లక్షల ఇండ్లకు 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేయడం, మహేశ్వరం నియోజకవర్గానికి 20వేల ఇండ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
అపార్టుమెంట్లో ఫ్లాట్ కొ నాలంటే రూ.20లక్షలు అవుతుందన్నారు. అ లాంటి ఇల్లును ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ డి.శ్రీనివాస్రెడ్డి, మే యర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈఈ గోపీనాథ్, కార్పొరేటర్ లీలా రవినాయక్, కార్పొరేటర్స్ అరుణ ప్రభాకర్రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, అక్కి మాధవి, అర్కల భూపాల్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ గౌడ్, తీగల మాధవి సాయినాథ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
పేదలు తలెత్తుకొని గౌరవంగా బ్రతకడానికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టుకోండి. కాలనీలో ఒక కమిటీ వేసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోండి. సమస్యలుంటే అందరు సమన్వయంతో పరిష్కరించుకోవాలి. కేసీఆర్ చేసిన మంచి పనిని ఎల్లప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఫొటో పెట్టుకోండి. మంచి పని చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి.
– మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి