కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను, వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మె ల్సీ కుర్మయ్య గారి నవీన్ కుమార్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సయ్యద్ ఓమర్ జమీల్లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ‘కేజీ టూ పీజీ’ నాణ్యమైన చదువులను అందించే దిశగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని, ప్రతి విద్యార్థికి రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అందువల్లే గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.
కరోనా విపత్క ర సమయంలో డిజిటల్, ఆన్లైన్, టీ శాట్ ద్వారా చదువులను అందించడం వల్ల దేశంలోనే మంచిపేరు లభించిందన్నారు. ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించిన ఎంసె ట్ కోచింగ్లో 20 వేల మంది కోచింగ్ తీసుకోగా 2 వేల మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో నగరంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా రు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి భోపాల్ ఎయిమ్స్లో సీటు సాధించిన మనస్వి, గోవా ఎన్ఐటీలో సీటు సాధించిన బాంద్యా నాయక్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున ల్యాప్టాప్లను అందజేశారు. కూక ట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, కూకట్పల్లిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడా ల శిరీషా బాబురావు, మందడి శ్రీనివాస్ రావు, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, సబీహా బే గం, ప్రిన్సిపాల్ రూపాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తుంది. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలు దీటుగా గురుకులాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన బోధనతో విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలలోనే చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. – కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి