మహబూబ్నగర్ : దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆలయాలకు మంత్రి నిరంజన్ రెడ్డి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.