ఘట్కేసర్/ పీర్జాదిగూడ/బోడుప్పల్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదరించి అభివృద్ధి పరుస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చే దుస్తులను మంత్రి బుధవా రం ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలలో అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజ వర్గంలో 6వేల మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అడిషన్ కలెక్టర్ శాంసన్ చైర్మన్లు ఎం. పావని జంగయ్య యాదవ్, బి. కొండల్రెడ్డి, కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం.సురేదంర్రెడ్డి, బి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ వై. సుదర్శన్రెడ్డి, కమిషనర్లు సురేశ్, వసంత, రైతు సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి సెట్విన్ సెంటర్ ఆవరణలో బుధవారం మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, కమిషనర్ రామకృష్ణారావు, మేయర్ వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయ ర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, నవీన్రెడ్డి, అమర్సింగ్, యుగేందర్రెడ్డి, అనంతరెడ్డి, బచ్చరాజు, బండారి మంజుల, పప్పుల రాజేశ్వరి, బొడిగ స్వాతి, శశిరేఖ, సుమలత నాయకులు ఈశ్వర్రెడ్డి, రవీందర్, రఘుపతిరెడ్డి, అంజిరెడ్డి, దేవేందర్గౌడ్, యా సారం మహేశ్, మనోరంజన్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలకు సరైన గౌరవమర్యాదలు లభిస్తున్నాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ పరిధిలోని ఎస్ఎస్ఎస్ గార్డెన్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు వందలాది మంది క్రిస్టియన్ సోదరి,సోదరీమణులు పాల్గొన్నారు.