ఉప్పల్, డిసెంబర్ 16: దేశంలోని వివిధ రాష్ర్టాల అభివృద్ధితో పోల్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో రూ.5.64 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ ప్రాంతాలలో గురువారం భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రజల కోసం పనిచేసే సీఎం దొరకడం మన అదృష్టమన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.
కాలనీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఈ వి.అశోక్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, ఈఈ నాగేందర్, కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బండారు శ్రీవాణి, కక్కిరేణి చేతన, మందుముళ్ల రజితా పరమేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గంధం జ్యోత్న్స నాగేశ్వర్రావు, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గంధం నాగేశ్వర్రావు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, రామంతాపూర్ అధ్యక్షుడు ముస్తాక్, హబ్సిగూడ అధ్యక్షుడు డా.చారి పాల్గొన్నారు.