వరంగల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో రేపు(బుధవారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి సందర్శించారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేటీఆర్ పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రజిని, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు.