నిజామాబాద్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. వర్ని మండలంలో గల సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది.
ఈ నెల 11న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉండగా 15వ తేదీకి మార్చినట్లుగా స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ను రూ.119 కోట్లతో నిర్మించబోతున్నారు. 10వేల ఎకరాలకు సాగు నీరు కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.