హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఈ నెల 24, 25 తేదీల్లో వర్చువల్గా నిర్వహించనున్న 19వ బయో ఏషియా సదస్సు-2022కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో దాదాపు 70 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రపంచంలోని లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించనున్నారు. ఈ సారి బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ బిల్గేట్స్ పాల్గొనబోతుండటం ప్రత్యేక ఆకర్షణ కానున్నది. ఆయనతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వివిధ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కొవిడ్-19 మహమ్మారి, గత రెండేండ్లలో నేర్చుకొన్న విషయాలు, ఆరోగ్య సంరక్షణ పద్ధతుల అభివృద్ధి తదితర అనేక రకాల థీమ్ల గురించి బిల్గేట్స్తో మంత్రి కేటీఆర్ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. సదస్సులో ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్సీ, మెడ్ట్రానిక్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఎస్ మార్తా తోపాటు మరికొందరు ప్రముఖులు కీలక ప్రసంగం చేస్తారు. మహమ్మారి ప్రభావం, అంతరాయాలు, ఆవిషరణలు, పర్యావరణ వ్యవస్థ, స్టార్టప్లు, ఆరోగ్య సంరక్షణలో కొత్త టెక్నాలజీల పాత్ర తదితర అంశాలపై అలెక్స్ గోర్సీ మాట్లాడనున్నారు. మెడ్టెక్ వృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నాల్లో భారతదేశం, ఆసియా పోషించాల్సిన పాత్ర, మెడ్టెక్ రంగంలోని ప్రపంచ పోకడల గురించి జెఫ్రీ ఎస్ మార్తా ప్రసంగించనున్నారు.
పారిశ్రామిక అభివృద్ధిలో బయో సదస్సు ఎంతో కీలకం: తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్
బయోఏషియా సదస్సులో బిల్గేట్స్ కూడా పాల్గొననుండటం ఆనందంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పేర్కొన్నారు. 2021లో నిర్వహించిన సదస్సులో 72 దేశాల నుంచి 31,100 మంది ప్రతినిధులు వర్చువల్గా ఈ ఈవెంట్లో పాల్గొన్నారని తెలిపారు. పెట్టుబడి ప్రమోషన్తో పాటు నెట్వరింగ్, పాలసీ అడ్వకసీకి ఈ వేదిక ఎంతగానో దోహద పడుతుందని తెలంగాణ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు. ఈ వేదికను ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
అసలు బయోఏషియా ఎలా పుట్టింది?
బయోటెక్, బయోఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు, బయోటెక్నాలజీ రంగంలో కొత్త ఆవిషరణలు, పరిషారాలను మెరుగుపరచడం, ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో బయోఏషియాకు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్లో బయోఏషియా నిర్వహించడం ఇది 19వ సారి. పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, విధాన రూపకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంపై ఇది దృష్టి సారిస్తున్నది. సమర్థవంతమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా పరిశ్రమల వృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. పరిశ్రమల్లో మంచి విధానాలు అవలంబిస్తున్న సంస్థలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఆరోగ్య రంగంలోనూ కీలక సంసరణలకు బయోఏషియా నాంది పలుకుతున్నది.
గేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు
బయోఏషియా సదస్సు-2022 ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన సమస్యలపై చర్చించే గ్లోబల్ లీడర్లను ఒకే గొడుగు కిందకు తెస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. బలమైన వ్యక్తుల ఆలోచనలు పంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. 2022 ఎడిషన్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు భాగస్వాములు అవుతుండటం సంతోషకరంగా ఉన్నదని చెప్పారు. పరిశ్రమల ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, రాబోయే రోడ్మ్యాప్ను నిర్ణయించడానికి గేట్స్తో ఆసక్తికరమైన సెషన్ కోసం ఎదురుచూస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అపారమైన పరిజ్ఞానం ఉన్న గోర్సీ, మార్తా అనుభవాలను పంచుకోవడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోఏషియా ప్రతినిధులు కూడా ప్రయోజనం పొందుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.
బయోఏషియా సదస్సు
-2022 విశేషాలు
నిర్వహణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
థీమ్: ఫ్యూచర్ రెడీ
హాజరుకానున్న దేశాలు : 70
లక్ష్యాలు: బయోటెక్, బయోఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు, బయోటెక్నాలజీ రంగంలో కొత్త ఆవిషరణలు, పరిషారాలను మెరుగుపరచడం, ప్రోత్సహించడం
హాజరుకానున్న ప్రముఖులు:
బిల్గేట్స్ (బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్)
అలెక్స్ గోర్సీ (జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్)
జెఫ్రీ ఎస్ మార్తా (మెడ్ట్రానిక్ చైర్మన్ అండ్ సీఈవో)