హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలల స్థాయి పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు 204 అల్పాసంఖ్యాక వర్గాలకు పాఠశాలలు ఏర్పాటు చేసింది. 2018-19లో 12 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశాం. 2020-21లో 71 టీఎంఆర్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశాం. మైనార్టీ వర్గాల్లోని ముస్లింలు, క్రైస్తవులతో పాటు ఇతర వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. 2016-17లో 71, 2017-18లో 133 టీఎంఆర్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బాలురకు 107 పాఠశాలలు, బాలికలకు 97 పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 30,560 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 7,570 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని మంత్రి తెలిపారు.