హుజూరాబాద్: అన్ని వర్గాల వారి సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని సీఎం అన్ని మతాలు, కులాల వారిని సమానంగా చూస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంఓని 1,2 వార్డులల్లో ధర్మారం ప్రజలతో ఆయన మాట్లాడారు. అనంతరం పద్మశాలి వాడ, పాత మారెట్ ఏరియాల్లో ఆయన ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, కార్యదక్షత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనన్నారు.
ఒంటరి మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేసిన సీఎం వారికి పించన్ అందిస్తున్నాడని అన్నారు. గతంలో ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేవి వీటి వల్ల పేదలు అప్పులపాలు అయ్యేవారు. కేసీఆర్ మంచి ఆలోచన చేసి అమ్మఒడి పథకం పథకం తేవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగాయని అన్నారు. గత పాలకులు చెరువులను పట్టించుకోలే, కెసిఆర్ 46వేల చెరువులను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మిషన్కాకతీయ ద్వారా మరమ్మత్తులు చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్న ప్రభుత్వాన్నే ఆడబిడ్డలు ఆదరించాలన్నారు.
ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, మనది దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రం తెలంగాణ. ముస్లింల ఉన్నతికి పలు పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. అమ్మాయిలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గురుకులాలు నెలకొల్పడంతో పాటు షాదీ ముబారక్ ద్వారా లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, మహిళల భద్రతకోసం షీ టీంలు ఏర్పాటు చేశామన్నారు.
10వేల మంది ఇమామ్ లు, మౌజంలకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నది ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య వీరన్న,భిక్షపతి, సింగిల్ విండో ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ,టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, కశ్యప్ రెడ్డి, రామస్వామి, సలీం పాష తదితరులతో పాటు గులాబీ శ్రేణులు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.