ఆనాడు అడ్డంకులు సృష్టించినవాళ్లు ఇప్పుడు లెంపలేసుకోవాలి. జ్ఞానోదయం కలగాలి. కోర్టుల్లో, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసిండ్రు. ప్రజలను రెచ్చగొట్టిండ్రు. రకరకాల కుట్రలు చేసిండ్రు. అడ్డంకులు సృష్టించినవాళ్లు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు. సహకరించడం చాతకాకపోతే సప్పుడుజేయక ఊకోవాలి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది.
– మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అడ్డంకులు, అనుమానాలు, విష ప్రచారాలన్నింటినీ అధిగమించి నాలుగేండ్లలోనే మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పూర్తిచేయగలిగామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద జలాశయమైన మల్లన్నసాగర్కు అడ్డంకులు కల్పించినవారు బహిరంగ క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాలని డిమాండ్చేశారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభం నేపథ్యంలో మంత్రి హరీశ్రావు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
మల్లన్నసాగర్ ప్రారంభాన్ని ఎలా భావిస్తున్నారు?
చాలా సంతోషంగా ఉన్నది. బుధవారం 12 గంటలకు సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్కు చేరుకొంటారు. పంప్హౌస్లో మోటర్లు ఆన్చేసి పైన డెలివరీ సిస్టర్న్ వద్ద పూజలు నిర్వహించి గోదావరి జలాలను రిజర్వాయర్లోకి విడుదలచేస్తారు. అధికారికం గా ఈ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితంచేస్తాం. రిజర్వాయర్లో కెపాసిటీకి అనుగుణంగా మరిన్ని నీళ్లు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. మల్లన్నసాగర్ డిజైన్, నిర్మా ణం, పూర్తిచేయడంలో సీఎం కృషి, పట్టుదల ఎంతో ఉన్నది. సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు హృదయ పూర్వక ధన్యవాదాలు.
మల్లన్నసాగర్తో ఎలాంటి ప్రయోజనాలున్నాయ్..
సహజంగా నదికి అడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తాం. ఏది లేకపోయినా ఇక్కడ మ్యాన్మేడ్ రిజర్వాయర్ నిర్మించాం. దీన్ని 50 టీఎంసీల నీటితో నింపుకొం టాం. కరువుకాలంలో కూడా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. 11.30 లక్షల ఎకరాలకు సాగునీరివ్వటమే కాకుండా పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చుకుంటాం. ప్రస్తుతం మల్లన్నసాగర్కు రోజుకు టీఎంసీ నీరు తెచ్చుకొనే వ్యవస్థ ఉన్నది. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి రెండో టీఎంసీ తీసుకొచ్చే పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రెండు మూడేండ్లకు, నాలుగేండ్లకోసారి కాలం తక్కువ అవుతుంటది. అప్పు డు ఈ రిజర్వాయర్ ఆదుకుంటుంది. సిద్దిపేట జిల్లాతోపాటు మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, నల్లగొండ, జనగామ జిల్లాలకు సాగునీరు అందుతుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలను ఇది తీర్చుతుంది. మల్లన్నసాగర్ ఒకపెద్ద వాటర్ జంక్ష న్. ఈ రిజర్వాయర్కు 22.6 కి.మీ బండ్ నిర్మాణం చేశాం. త్వరలో ఈ ప్రాంతం కోనసీమను తలపిస్తుంది.
పంటల విధానం ఎలా ఉండబోతున్నది?
ఇంతకుముందు నీరు లేక వర్షాధారిత పంటలు సాగుచేశాం. ఇప్పుడు నీళ్లొచ్చాయి కనుక పంటల స్వరూ పం, రైతుల ఆలోచన మారుతుంది. పాడి, పంట పెరుగుతాయి. వాణిజ్య పంటలకు ఆస్కారం ఉంటుంది. డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే, అధిక ఆదాయాన్ని రైతులు పొందుతారు. మంచి భూములు, కరెంట్ ఉం ది, గోదావరి నీళ్లు వస్తున్నాయి. రైతులు కొత్త పంటలు పండించాలి. ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లు వ్యవసాయంవైపు చూస్తున్నారు. వినూత్న తరహాలో చక్కటి పంటలు పండిస్తున్నారు. హైదరాబాద్ దగ్గరలో ఉండటంతో అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలు, పండ్లు, కూరగాయలు, పువ్వులు, తదితర పంటలు పండిస్తే మంచి డిమాండ్తో అధిక ఆదా యం సంపాదించవచ్చు.
పంట దిగుబడికి మార్కెటింగ్ ఎలా?
త్వరలోనే రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుం ది. రైల్వే సౌకర్యం ఉన్న పట్టణాలు, నగరాలకు ఇక్కడి పంట ఉత్పత్తులను సులభంగా రవాణా చేయవచ్చు. ఇప్పటికే కొడకండ్ల వరకు రైలు ట్రయల్న్ నిర్వహించారు. త్వరలోనే కొడకండ్ల వరకు రైలు ను ప్రారంభించుకొంటాం. ఏడాదిలోగా సి ద్దిపేట వరకు రైలు అందుబాటులోకి వస్తుం ది. అప్పుడు దేశం మొత్తం సరుకు పంపుకొ నే అవకాశం ఉంటుంది. గతంలో బొప్పా యి పంట పండిస్తే లారీల ద్వారా ఢిల్లీ, ఆగ్రా వరకు పంపేవాళ్లం. ఇప్పుడు రైలు వస్తే తక్కువ ఖర్చుతో ఎ క్కువ వేగంతో సుదూర ప్రాంతాలకు పంట ఉత్పత్తులను పంపించి మంచి ధర పొందే చాన్స్ ఉంటుంది.
మల్లన్నసాగర్ నిర్మాణానికి అడ్డంకులు ఎలా అధిగమించారు?
ఆనాడు అడ్డంకులు సృష్టించినవాళ్లు ఇప్పుడు లెంపలేసుకోవాలి. జ్ఞానోదయం కలగాలి. కోర్టుల్లో, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసిండ్రు. ప్రజలను రెచ్చగొట్టిండ్రు. అపోహలు అనుమానాలు, లా అండ్ అర్డర్ సమస్యలను సృష్టించిండ్రు. రకరకాల కుట్రలు చేసిండ్రు. అడ్డంకులు సృష్టించినవాళ్లు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు. సహకరించడం చాతకాకపోతే సప్పుడుజేయక ఊకోవాలి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది. దేశంలో పదేండ్లలోపు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడా పూర్తి కాలేదు. మల్లన్నసాగర్ను మూడున్నరేండ్లలోనే పూర్తి చేసుకున్నాం. అదంతా సీఎం కేసీఆర్ కృషి, పట్టదల వల్లనే.
రిజర్వాయర్ల నిర్మాణంతో రైతుల పరిస్థితి ఎలా మారింది?
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకల్లో ఒకప్పుడు కరువుతో విలయతాండవం చేసింది. ఇక్కడ ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలు, వలసలు, రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. అలాంటి ప్రాంతం ఇప్పుడు రిజర్వాయర్ల జిల్లాగా మారింది. అందులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించుకోవడం ఇక్కడి ప్రజలకు వరం. ఇది ఉత్తర తెలంగాణకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గుంటకు సాగునీరు అందుతుంది. ఇక నీటి కొరత అనేది గతం ముచ్చట. వలసలు పూర్తిగా తగ్గాయి. ఛత్తీస్గఢ్, బీహార్, యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకొంటున్నారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టుతో నిర్మించిన రిజర్వాయర్ల వల్లనే సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింతగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి ప్రాంత యువతకు మేలు జరుగుతుంది. ఇవ్వాళ భూముల విలువలు పెరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు.
నిర్వాసిత కుటుంబాలను ప్రభుత్వం ఎలా ఆదుకొన్నది?
ప్రభుత్వం తరఫున నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారందిరి సహకారంతోనే ఇంత పెద్ద రిజర్వాయర్ను కేసీఆర్ నిర్మించగలిగారు. ఇంకా ఎవరైనా మిగిలినా అందరికీ న్యాయంచేస్తాం. ప్రతి ఒక్కరికీ భూసేకరణ చట్టంకంటే అధికంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చింది. గజ్వేల్కు దగ్గరలో మంచి విలువ గలిగిన స్థలంలో ఆర్అండ్ఆర్ కాలనీలను నిర్మించి ఇవ్వడమే కాకుండా అన్ని వసతులను కల్పించింది. దేశంలోనే ఇన్ని వసతులతో కూడిన ఆర్అండ్ఆర్ కాలనీ బహుశా ఇదే మొదటిది.