సిద్దిపేట : జిల్లాలో సోమవారం రికార్డుస్థాయిలో కురిసిన భారీ వర్షాలకు ప్రాథమిక అంచనా మేరకు 208 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రావు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.3,200 చొప్పున రూ.6,65లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. సోమవారం వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు సిద్దిపేట అర్బన్ మండలంలో 19 ఇండ్లు, చిన్న కోడూరులో 138, నంగునూరులో18, నారాయణరావుపేటలో 2, దుబ్బాకలో 15, దౌలతాబాద్లో 11, తోగుటలో 4, చేర్యాల మండలంలో ఓ ఇల్లు దెబ్బతింది.