హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అరుదైన వ్యాధితో బాధపడుతూ, చికిత్సకు డబ్బుల్లేక భవిష్యత్పై ఆశలు కోల్పోయిన యువకుడిని మృత్యుముఖం నుంచి కాపాడిన హరీశ్రావు.. ప్రజల మంత్రి అంటూ ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కొనియాడారు. ప్రాణాపాయంలో ఉన్న యువకుడిని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడేనికి చెందిన బాడ హర్షవర్ధన్ క్రోన్స్ (బయోలాజికల్ థెరపీ) అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఒకదశ లో అతనికి చికిత్స చేయలేమంటూ వైద్యులు చేతులెత్తేశారు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన హరీశ్రావు.. బాధితుడిని నిమ్స్కు తరలించారు. వైద్యులు అవసరమైన సేవలు అందించటంతో అతడు కోలుకుంటున్నాడు.
సీఎం సహాయ నిధి నుంచి మంత్రి రూ.7 లక్షలు ఇప్పించారు. హరీశ్రావు తక్షణ స్పందనతో ఒక ప్రాణం నిలబడటంపై శేఖర్ కమ్ముల బుధవారం ఓ ట్వీట్లో స్పం దించారు. ‘గత మూడేండ్లుగా కరోనా సృష్టిస్తున్న విలయంపై ఎంతగానో పోరాడుతున్నాం. అలాంటి తరుణంలో అంతేసవాల్గా తీసుకొని వైద్యసిబ్బంది తలమునకలై పనిచేయటం వల్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. హర్షవర్ధన్ కోలుకోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని పెంచటమే కాకుండా ప్రజల మంత్రిగా హరీశ్రావు తన ప్రతిష్ఠను మరింత పెంచుకున్నారు. మంత్రి, నిమ్స్ వైద్య సి బ్బంది తక్షణ స్పందనతో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు’అని ట్వీట్చేశారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజారోగ్యానికి అ ధిక ప్రాధాన్యం ఇస్తున్నది. హర్షవర్ధన్ ఆరోగ్యాన్ని మెరుగుచేసేందుకు కృషి చేసిన నిమ్స్ బృందానికి అభినందనలు’ అంటూ మంత్రి హరీశ్రావు రీట్వీట్ చేశారు.