సిద్ధిపేట : సిరిసిల్ల రోడ్లో రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సమీపంలో రూ.54లక్షలతో ఏర్పాటు చేసిన సుడా పార్క్ను మంత్రి హరీశ్రావు బుధవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పక్షి ఎగిరే పాల పిట్టలు, అశోక చక్రం, జాతీయ చిహ్నం, పచ్చని మొక్కలు, పచ్చిక బయళ్లు, గ్రీన్ లాన్, రాత్రి సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులతో చూపరులను ఆకట్టుకుంటున్నది.
ఈ పార్క్ సిరిసిల్ల – సిద్దిపేట రహదారికి కొత్త అందాన్ని తీసుకువచ్చిందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజులరాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా వైస్ చైర్మన్ కేవీ రమణాచారి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.