ఉద్యోగ నేతలతో మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లో తనను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గంగుల మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ ఇంచార్జిగా వ్యవహరించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ తదితరులు ఉన్నారు.