పాలకుర్తి, సెప్టెంబర్ 21 : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాదాపు అంతరించే స్థాయికి చేరిన అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకుంటున్న చరిత్ర, ఘనత సీఎం కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ సర్కార్ కునారిల్లుతున్న కుల వృత్తులకు సర్కార్ జీవం పోసింది.
అత్యంత వెనుకబడిన కులాలకు కేసీఆర్ చేయూతనిస్తున్నారని మంత్రి తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన బీసీ కులాల చేతి వృత్తుల వారు 290 మందికి రూ.2 కోట్ల 90 లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి పాలకుర్తి లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుఊత.. తెలంగాణలో ఒకప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల అంటూ పాటలు పాడుకునే దుస్థితిలో కులవృత్తులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయన్నారు. అప్పటి పాలకులు కులవృత్తులను, వ్యవసాయాన్ని, నిర్లక్ష్యం చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అటు వ్యవసాయాన్ని ఇటు కులవృత్తులని అన్ని విధాల ఆదుకుంటూ వాటికి జీవం పోసారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ఈ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తుందని, ఇప్పుడు రాని వారు బాధపడాల్సిన పని లేదని, త్వరలోనే మిగతా వారికి ఈ ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.