ములుగు : మేడారం జాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. జాతర జరిగే చుట్టుముట్టు 40 నుంచి 50 కి. మీ. మేర జాతర కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సేద తీరుతున్నారు. నిన్న సారలమ్మ గద్దె మీదకు వచ్చింది.
చిలుకల గుట్ట నుంచి ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దె మీదకు రానున్నది. దీంతో ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి దర్శనం కోసం ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి వస్తారు. ఇవ్వాళ సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సమ్మక్క, సారలమ్మ లు గద్దె ల పైనే ఉంటారు.
దీంతో మేడారం మహా జాతర ప్రధాన ఘట్టం ఈ రోజు సాయంత్రంతో మొదలవుతుంది. మరోవైపు మేడారం జాతరకు రేపు ఉదయం సీఎం కేసీసీఆర్ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేపు రోజు మొత్తం మేడారంలో నే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు జాతరలో నే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు.
మరోవైపు మంత్రి అధికారులతో జాతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.