వరంగల్ : వరంగల్లోని ధర్మారం సమీపంలో నూతనంగా 318 షాపులతో నిర్మించిన ‘వరంగల్ హోల్ సేల్ కాంప్లెక్స్’ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
కార్యక్రమంలోఎ మ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.