తొర్రూరు, మార్చి 28 : 75 ఏళ్ల పాలనలో తీరని వెతలను తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలోనే తీర్చి అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మండలంలోని అమ్మాపురం, మడిపెల్లి గ్రామాల్లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా, మంత్రి పాల్గొని పార్టీ శ్రేణలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల ప్రగతిని ప్రజలకు వివరిస్తూ, మున్ముందు చేపట్టాల్సిన పనులపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని మరవొద్దని, అన్ని పనులు ఏకకాలంలో పూర్తి చేయడం ఎవరి వల్లా సాధ్యంకాదని, ఎనిమిదేళ్లలో పెద్దఎత్తున చేపట్టిన పనులతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా మారాయి? అన్న విషయాల్ని ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు.
కాళేశ్వరంతో సస్యశ్యామలం
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంత కరువు తీరిందని, పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు కూడా వేగవంతంగా సాగేలా నిరంతరం సమీక్షిస్తున్నా మన్నారు. తెలంగాణ రాక ముందు కాల్వలు తవ్వి ఖాళీగా వదిలేయడం తప్పా, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి కావాల్సినన్ని నీళ్లు వస్తుండడంతో రైతులు కోన సీమను మించి పంటలు పండిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తంచేశా రు. ఈ చలువ ముఖ్యమంత్రి కేసీఆర్ది కాదా.. ఆలోచిం చుకోవాలన్నారు. రూ.50వేల కోట్లతో దేశంలో ఎకడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి వివరించారు.
మహిళలకు కుట్టు శిక్షణ, ఉచిత మిషన్లు
దేశంలో, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్త్రీనిధి పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఉచిత కుట్టు శిక్షణను పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. మొదటి విడుతగా రూ.5.10కోట్లతో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పారులో 10వేల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని అకడ ప్లేస్మెంట్ జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పాలకుర్తి నియోజకవర్గం ముందున్నదన్నారు. అర్హులైన వారికి నూతనంగా గృహాలు మంజూరు చేస్తామని, 3 నెలలకోసారి దశల వారీగా సొంత జాగ ఉన్న వారికి రూ.3 లక్షల చొప్పున నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ చిన్న అంజయ్య పాల్గొన్నారు.