హైదరాబాద్ : యూపీఎస్సీ-2020 ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించిన శ్రీజ, 413వ ర్యాంకు సాధించిన వర్షితను ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం అభినందించారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ తల్లిదండ్రులు శ్రీనివాస్, కీర్తిలత హైదరాబాద్లో ఉప్పల్ చిలుకానగర్లో స్థిరపడగా.. వర్షిత కుటుంబం హన్మకొండ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీజ, వర్షిత వరంగల్ కీర్తి పతాకను దేశవ్యాప్తం చేశారన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఇద్దరూ సాధించిన విజయం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి తోడ్నాటునందించిన తల్లిదండ్రులను ప్రశంసించారు. భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ.. భవిష్యత్లో కేంద్ర కేడర్లో మంచి అధికారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.