ములుగు : మేడారం జాతరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు బిజీ బీజీగా గడిపారు. సామన్య భక్తులతో పాటు వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్నీ తానై ఏర్పాట్లను చూస్తున్నారు.
సమ్మక్క- సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే అతిథులకు మంత్రి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.
శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. అలాగే జాతరంతా కలియతిరుగుతూ..ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.