హైదరాబాద్, జనవరి 31 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యను సోమవారం బస్భవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సన్మానించారు. సామాన్య కుటుంబం నుంచి తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి.. అసమాన ప్రతిభతో పద్మశ్రీ అవార్డు కైవసం చేసుకోవడంపై అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం మొగిలయ్య స్పందిస్తూ సీఎం కేసీఆర్ తనకు అండగా నిలిచి, తన కళను వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు జీవితంలో మరచిపోలేనివని చెప్పారు. తన ఇబ్బందులను అర్థంచేసుకొని ఉచిత బస్పాస్ సమకూర్చినందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపారు .