Microplastics | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గర్భిణుల్లో మైక్రోప్లాసిక్ రేణువులు పెరుగుతుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. టాక్సిలాజికల్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. సైంటిస్టులు 62 మంది గర్భిణుల శాంపిళ్లను పరిశీలిస్తే ప్రతి గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మైక్రో ప్లాస్టిక్ కనిపించింది.
ఈ సంఖ్య చూడటానికి చిన్నదిగా కనిపించినా ఆరోగ్యంపై ప్రభావం చూపించొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ ప్లాస్టిక్ రేణువులు మొదట గర్భస్థ మావి ఆ తర్వాత ఈ భూమిపై ఉన్న మొత్తం క్షీరదాల జీవితాలపై ప్రభావం చూపుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మాథ్యూ కాంపెన్ ఆందోళన వ్యక్తం చేశారు.