Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని నక్సలైట్లు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామ శివార్లలోని రోడ్డుపై మిచ్చా హద్మా మృతదేహం లభ్యమైందని పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు గుర్తుతెలియని నక్సలైట్ల బృందం తనపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అప్రమత్తమైన తర్వాత, పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించినట్లు అధికారి తెలిపారు. హత్య వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, దుండగుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన చెప్పారు. అయితే, ఇన్ఫార్మర్ నెపంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.